నవతెలంగాణ – హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాగా, టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన మీదట గవర్నర్ తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్టీసీ విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి.