నవతెలంగాణ-రేగొండ
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానలు నమ్మి ప్రజలు మోసపోతే గోసపడతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. గురువారం మండలంలోని బాగిర్తి పేట, దుంపిల్లపల్లి, పెద్దంపల్లి, జూబ్లీ నగర్, రామన్నగూడెం తండ, నారాయణ పురం గ్రామాలలో వైస్ ఎంపీపీ కుందూరు ఉమారాణి విద్యాసాగర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహిం చారు. గండ్ర జ్యోతి హాజరై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని బొట్టు పెట్టి అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటుచేసిన సమావేశాలలో గండ్ర జ్యోతి మాట్లాడుతూ అభివద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన బిఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన మేనిఫెస్టోను ప్రజలు చర్చించుకో వాలని అన్నారు. భూపాలపల్లి లో వైద్య కళాశాలను, వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశా మని తెలిపారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవని అన్నారు. నియో జకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసిన గండ్ర వెంకట రమణారెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ రహీం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రమణారెడ్డి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్, గండ్ర యువసేన మండల అధ్యక్షులు గంజి రజనీకాంత్, సర్పంచులు బొక్క భాస్కర్, పసుల ప్రియాంక రత్నాకర్, జంగేటి నరేష్, విజరు, ఎంపిటిసిలు కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.