నవతెలంగాణ-నెక్కొండ
ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దఢంగా నిలబ డాలని, జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్, బిజెపిలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఓ టర్ల చైతన్య యాత్రను రాష్ట్రవ్యాప్తంగా జరుగు బస్సు జాతలో భాగం గా గురువారం రాత్రి నెక్కొండలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆధికారి ఆకునూరి మురళీ, హైకోర్టు జడ్జ్జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడారు. బీఆర్ ఎస్, బిజెపిపైకి విరుద్ధ శక్తులుగా నటిస్తున్నా రెండుపార్టీల మధ్య పర స్పరం మూడోసారి అధికారం కొరకు బలమైన బంధం ఉందని, తెలం గాణలో భారీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారించకుండా, పైగా ఆ ప్రాజెక్టులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీర్తించింది. మోడీ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు పార్లమెంట్లో టిఆర్ఎస్ మద్దతు ఇస్తోం దన్నారు. తెలంగాణలో సుపరిపాలన అదశ్యమైంది. తెలంగాణలో దుర్మార్గపు పరిపాలన సాగుతున్నది. కేంద్రంలోని మోడీ బిజెపి ఫాసిస్ట్ నియంత విధానాలను, బిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ, ఆధునిక, రాచరిక, అవినీతి పరిపాలనను తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా తిర స్కరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దఢంగా నిలబడాలని, జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్, బిజెపిలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విన యకరెడ్డీ, హన్మేష్, పద్మజ, శంకర్, మొడెం మల్లేశ్, ఇర్ల పైడి, స్వరుప, నిర్మల, సంధ్య, సౌజన్య, రాములు, గౌస్, మోడెమ్ శ్రీలత, ఇరెల్లీ రాం చందర్, కొత్తపేల్లి రవి, న ర్సింహారావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.