– పార్టీకి తిరుగులేదు… వనమాకు ఎదురు లేదు
– సంక్షేమ పథకాలే విజయానికి నాంది
– ఏజెన్సీ తండాల అభివృద్ధి బిఆర్ఎస్తోనే సాధ్యం
– ఏ ఒక్క రోజైనా జలగం వచ్చాడా.. ఆలోచించండి
– ఎన్నికల ప్రచారంలో వనమా వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-లక్ష్మీదేవి పల్లి
నియోజకవర్గంలో బిఆర్ఎస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని, వనమాకు ఎదురులేదని బిఆర్ఎస్కు తిరుగు లేదనిబీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలైన రేగళ్ల, బంగారు చెలక, పునుకుడు, మైలారం తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వనమా వెంకటేశ్వరరావు పై పూలు చల్లుతూ డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ వనమాకు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన ప్రచార సభల్లో వనమా, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణలు మాట్లాడారు. అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని, కంటి ముందు అభ్యర్థి.. ఇంటి ముందు అభివృద్ధి బిఆర్ఎస్ లక్ష్యం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయానికి నాంది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తండాల అభివృద్ధి జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన బంగారుచెలక, ఉల్వనూరు లకు రోడ్డు వేయించిన ఘనత తనదేనన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే సేవకుడిలా పని చేస్తానని అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. గిరిజన ప్రాంతాలలో పోడు భూములు సాగు చేసుకునే రైతులకు 5000 పట్టాలు అందజేశానని, దళిత బంధు, రైతు బంధు, బీసీ, మైనార్టీ పందులతోపాటు, షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అందుకు నియోజకవర్గ ప్రజల సహకారం కావాలని ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. సంవత్సరానికి ఒక్కరోజు సంక్రాంతి పండుగ నాడు హరిదాసులైన కనబడతారు కానీ ఏనాడైనా ఏజెన్సీ ప్రాంతాలలో జలగం వెంకట్రావు కనిపించాడా అని ప్రశ్నించారు. ప్రజలను. అటువంటి వ్యక్తులకు ఓటేయకుండా దూరంగా ఉంచాలని, ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసే తనకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.