నవతెలంగాణ – న్యూఢిల్లీ: వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101 పెంచాయి. అంతకుముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిండర్ ధరన రూ.250 మేర పెరిగింది. అక్టోబర్లో మరో రూ.200 పెంచారు. ఇప్పుడు ఇంకో రూ.100 పెంచడంతో ఇటీవల తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైనట్లయ్యింది. కాగా, తాజా పెంపుతో కలిపి దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,833కు చేరింది. అంతకుముందు ఇది రూ.1,732గా ఉండేది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.1,999.50 కి, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో రూ.1,943 కి, మహారాష్ట్ర రాజధాని ముంబైలో రూ.1,785.50కి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెంచిన కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.