నవతెలంగాణ -డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యాలయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాదర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏళ్ల వెళ్లి అందుబాటులో ఉంటూ పని చేసేవారికే పట్టం కట్టాలని కోరారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని, ప్రతి రోజూ గడప గడపకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కుమ్మరి గంగాదర్, వీడీసీ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.