నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. 400 పరుగుల ఛేదనలో 9 పరుగులకే ఆసీస్ రెండు కీలక వికెట్లు పడ్డాయి. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0) ఔటయ్యారు. అయితే.. హ్యాట్రిక్ బంతికి మార్నస్ లబూషేన్(1) ఒక పరుగు తీశాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(0) క్రీజులో ఉన్నాడు.