– రాష్ట్ర పురవస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్
నవతెలంగాణ-గణపురం
మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళు, రెడ్డి గుడుల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఆయన కోటగుళ్ల సముదాయాన్ని రెడ్డి గుడులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కాకతీయులు నిర్మించిన ఆలయాలను పరిశీలించి వాటి అభివద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల పునరుద్ధరణకు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆయన వెంట వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్ ఉన్నారు.