– నేరాల నియంత్రణకు కృషి
– నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సిపి సత్యనారాయణ
నవతెలంగాణ-కంటేశ్వర్ : మహిళల భద్రతకే ప్రథమ లక్షమని ఆ తర్వాత నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు కృషి చేస్తానని నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడారు.నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణ నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన వి.సత్యనారాయణ అన్నారు. శనివారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేసిన అనుభవంతో శాంతిభద్రతల పర్యవేక్షణకు పాటుపడుతామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తామని, మహిళలకు జరిగే వేదింపులను అరికడుతామన్నారు. ఇటీవల కాలంలో సైబర్ క్రైం కేసులు పెరిగిన నేపథ్యంలో దాని కట్టడికి కృషి చేస్తామన్నారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా పని చేసిన కె.ఆర్.నాగరాజు పదవి విరమణ తర్వాత దాదాపు ఐదు నెలల తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా రాచకొండ జాయింట్ కమిషనర్ గా ఉన్న సత్యనారాయణకు పోస్టింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే.