నవతెలంగాణ – ఐనవోలు : కొండపర్తి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా పోషమ్మ గుడికి బోనాలు తీసుకొచ్చే గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యలు కలగకుండా జేసీబీ,డోజర్తో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్సన్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.