నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన 19 ఏళ్ల ఓ తెలుగు సంతతి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సంచలన విషాయలు వెలుగులోకి వచ్చాయి. తానే ఈ దాడి చేశానని నేరాన్ని ఒప్పుకున్నాడు సాయివర్షిత్. ప్రెసిడెంట్ జో బైడెన్ ను హత్య చేసేందుకు 6 నెలలుగా ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు సేకరించి.. అతడిని భారత సంతతికి చెందిన సాయివర్షిత్ కందులగా గుర్తించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమెరికాలోని మిస్సోరిలో ఉంటున్న యువకుడు ఫ్లైట్లో వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. వచ్చిరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్హౌస్లోకి దూసుకెళ్లాడు. వైట్హౌస్లో ఉన్న బారీకేడ్లను ట్రక్కుతో ఢీకొడుతూ దూసుకొచ్చిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కుపై నాజీ జెండాను గుర్తించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.