నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గోదావరి ఒడ్డున ఏర్పాటుచేసిన చెక్పోస్టును రింగల్ ఎస్సై ఉదయ్ కుమార్ గురువారం నాడు తనిఖీ చేశారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, మద్యం సరఫరా, నగదు తరలింపులను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. ఆయన వెంట స్థానిక సిబ్బంది ఉన్నారు.