నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ నందు నిర్వహించే ఉచిత శిక్షణ లో భాగంగా గరిష్టంగా వంద మంది విద్యార్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి క్యాటరింగ్ యాజమాన్యం నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి. శశికళ సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రతి విద్యార్ధి కి రోజుకు రూ.75 చొప్పున గరిష్టంగా వంద మంది విద్యార్ధులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, టీ & స్నాక్స్ మరుయు రాత్రి భోజనంలను మెనూ ప్రకారం ఐదు నేలల పాటు నిరంతరంగా ఏర్పాటు చేయవలెను. వివరాలకు నిజామాబాదు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీమతి బి. శశికళ గారిని సంప్రదించవలెను. ఇతర వివరాలకు చరవాణి 08462 295301 నెంబరును సంప్రదించగలరు. శిక్షణా తరుగతులు జూన్ 1 వ తేది నుండి అక్టోబర్ 31 వరకు నాందేవ్ వాడలో గల ఎస్సీ స్టడీ సర్కిల్ నందు నిర్వహించబడుతాయి అని తెలియజేశారు.