నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాదు జిల్లా ఎస్పీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల పోటీ పరిక్షల తరగతులు భోదించడానికి ఆసక్తి కలిగిన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి. శశికళ సోమవారం ప్రకటనలో తెలిపారు తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో అనుభవం కలిగి పీజీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. అయిదు నెలల ఉచిత శిక్షణలో ఆంగ్లం, అర్థమెటిక్, రీజనింగ్, జాగ్రఫీ, పాలిటీ, సోషియాలజీ, భారత- తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర, కరెంట్ ఎపైర్స్,అర్ధ శాస్త్రం, భౌతిక, రసాయన, జీవ శాస్త్రం తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ బోధించే అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవలెను. దరఖాస్తులు ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయం, ఎస్పీ బాలుర కాలేజీ హాస్టల్ (B), నాందేవ్ వాడ నందు సమర్పించవలెను. వివరాలకు చరవాణి 9491468799 నెంబరును సంప్రదించగలరు. శిక్షణా తరుగతులు జూన్ 1 వ తేది నుండి అక్టోబర్ 31 వరకు నిర్వహించబడుతాయి అని తెలియజేశారు.