నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరబాద్ లోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చేందుకు యత్నించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన స్థూపం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచబోమని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని అన్నారు. సవాల్ కు అనుగుణంగా ఇవాళ స్థూపం వద్దకు ఆయన రాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.