నవతెలంగాణ-హైదరాబాద్ : దీపావళికి కాస్త దిగొచ్చిన పసిడి ధరలు గత రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు కూడా మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. వెండి కిలో ధర రూ.1700 మేర పెరిగి .. 74,700 లుగా కొనసాగుతోంది..