నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచక్రికెట్ లో ఓ భారీ రికార్డు నమోదైంది. అది కూడా అలాంటి ఇలాంటి రికార్డు కాదు. చిలీతో జరిగిన టీ20 మ్యాచ్లో అర్జెంటీనా మహిళల జట్టు 427 పరుగులు చేసింది. పురుషుల లేదా మహిళల కేటగిరీ విభాగంలో.. టీ20 ఇంటర్నేషనల్లో తొలిసారిగా ఒక జట్టు 400 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అంతేకాదు ఈ మ్యాచ్లో అర్జెంటీనా 364 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు అంతర్జాతీయ టీ20ల్లో 318 పరుగులే అత్యధిక స్కోరు. 2022లో సౌదీ అరేబియాపై బహ్రెయిన్ మహిళల జట్టు ఈ స్కోరు సాధించింది. మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. అర్జెంటీనా ఓపెనర్ బ్యాట్స్మెన్ ఇద్దరూ సెంచరీలు సాధించారు. లూసియా టేలర్ 84 బంతుల్లో 169 పరుగులు చేసింది. టీ20 ఇంటర్నేషనల్లో ఏ మహిళా ప్లేయర్కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆమె ఇన్నింగ్స్లో 27 ఫోర్లు నమోదయ్యాయి. అంటే 108 పరుగులు కేవలం బౌండరీలతోనే పరుగులు సాధించింది లూసియా.