నవతెలంగాణ – అమెరికా
శాన్ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికి తెగబడటాన్ని అమెరికా చట్టసభల సభ్యులు, ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్లు ఖండించారు. ఈ నేరపూరిత చర్యకు తెగబడ్డ నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, అమెరికాలో భారతీయ రాయబారి తరణజీత్ సంధూపై ఖలిస్థానీ వాదులు నోరుపారేసుకుంటున్న తీరును కూడా వారు తప్పుబట్టారు. వాక్స్వాతంత్ర్యం అంటే హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదని హితవు పలికారు. జూలై 2 కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయ్యానికి నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది చొప్పున మంటలను ఆర్పేశాడు. కాగా, ఘటన సంబంధిత వీడియో నెట్టింట వైరల్గా మారింది. హింసను ప్రోత్సహిస్తే హింసే ఎదురవుతుందంటూ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. భారత్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వార్తలు కూడా జత చేశారు. దీంతో, ఈ ఘటన పెను దుమారానికి దారి తీసింది.