– మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించాలని
– పర్యటనను ప్రారంభించిన ముదిరెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ- పెన్ పహాడ్: మండల పరిధిలోని మాచారం గ్రామ ఆవాసం విద్యానగర్ కు చెందిన ప్రజలు రాజేష్ అన్న యువసేన ఆధ్వర్యంలో వివిధ వాహానాల్లో యాదాద్రి పుణ్యక్షేత్ర పర్యటనకు గురువారం బయలుదేరారు. ఈ పర్యటనను మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముదిరెడ్డి రంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ క్షేమంగా వెళ్లి దైవదర్శనం చేసుకుని, మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించాలని ప్రజలందరూ ఆ యాదాద్రిషున్ని వేడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైదులు, రాజేష్, రోజ్ బాబు, నాగరాజు, సతీష్, నాగేంద్ర, సురేందర్, శ్రీను, ముత్తయ్య, సంజీవ, గురవయ్య, రాములు, మహేష్, బిక్షం, పవన్, శ్యామ్, చరణ్, వెంకన్న, అఖిల్, పవన్, సందీపు, పృథ్వీ, నాగరాజు, అశోక్, గ్రామ ప్రజలు, రాజేష్ అన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.