– ఐఎంపీఎస్లో లోపం..!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్ సిస్టమ్లో సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లో రూ.820 కోట్లు జమ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ రూ.649 కోట్లు రికవరీ చేసింది. ఇమిడిటే పేమెంట్ సర్వీస్ (ఐఎంపిఎస్) సిస్టమ్లో సాంకేతిక లోపం నెలకొనడంతో ఈ సమస్య ఉత్పన్నమయినట్టు సమాచారం. ఈ పొరపాటు గుర్తించిన వెంటనే బ్యాంక్ యాజమాన్యం వేగంగా ఆయా ఖాతాలను బ్లాక్ చేసింది. అయినప్పటికీ 79 శాతం సొమ్మును మాత్రమే రికవరీ చేసినట్టు తెలిపింది. మరో రూ.171 కోట్లు వెనక్కు తెప్పించాల్సి ఉందని రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 10-13 తేదీల మధ్య ఐఎంపిఎస్లో సాంకేతిక లోపంతో పొరపాటున తమ బ్యాంకు ఖాతాదారుల ఖాతాల్లో జమ అయ్యాయని యూకో బ్యాంక్ తెలిపింది. ఈ పొరపాటు వ్యవహారం ఈ నెల 15 బయటకు వచ్చింది.