‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్హొరాజ్పుత్. తెలుగుకు తననుహొపరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు.
అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. ఈనెల 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా పాయల్ మీడియాతోహొమాట్లాడుతూ,”ఆర్ఎక్స్ 100′ తర్వాత అజరు భూపతి దర్శకత్వంలో నటించిన చిత్రమిది.
ఈ సినిమా కోసం ‘సార్… నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి’ అని అజరు భూపతి వెంట పడ్డాను. ‘మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా’ అనిహొచెప్పారు. ఆయనకు నా పొటెన్షియల్,హొ ట్యాలెంట్ తెలుసు. తెలుగు ఇండిస్టీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం. ఇండియాలో ఈ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు.హొఇందులో నేను శైలుహొపాత్రలో నటించా. సినిమా చూశాక ఆ అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది. సినిమాలో చాలా ఎమోషన్స్హొఉన్నాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. నావరకు ఇది చాలా ఛాలెంజింగ్ రోల్. రియల్ లైఫ్లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం లేదు(నవ్వుతూ). ఇందులో నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ట్విస్టులలోహొఆమెదిహొకీలక పాత్ర ఉంటుంది.హొఫిమేల్ ఓరియెంటెడ్ సినిమానుహొలేడీ ప్రొడ్యూసర్ చేయటం ఆనందంగా ఉంది. షూటింగ్ టైములోహొస్వాతి రెడ్డిని కలవలేదు. కానీ, ఫోనులోహొమాట్లాడాను. స్వాతి సురేష్ వర్మ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’ అని తెలిపారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజి మీద ‘పాయల్… నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇందులో నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదు’ అని అల్లు అర్జున్ చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా.