నవతెలంగాణ -హైదరాబాద్: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1.. సూర్యుడిపై భారత్ ప్రయోగాలకు తొలి అడుగు పడింది. ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం ఉదయం 11.50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ-57 ద్వారా ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టారు. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్.. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ (ఎల్ 1) వద్దకు చేరుకోనుంది