నవతెలంగాణ-శాయంపేట
ఆయిల్ ఫామ్ కొమ్ము పురుగు నివారణ పైరైతులకు అవగాహన కల్పించిన విదేశీ మండలంలొని మాందారిపేట గ్రామ శివారులోని కానిగంటి సదానందం వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ తోటను గురువారం విదేశీ సైంటిస్టులు సందర్శించి పరిశీలించారు. నీకోలాస్ (మలేషియా), డాక్టర్ లారెన్స్ (ఫ్రాన్స్), విజయన్(ఇండోనేషియా) కు చెందిన శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆయిల్ ఫామ్ రైతులతో మాట్లాడుతూ కొమ్ము పురుగు నివా రణపై అవగాహన కల్పించారు. వచ్చే తెగుళ్లు, పెంపకంపై నివారణ ఎలా చేప ట్టాలో తెలియచేస్తూ మెటరైజంఅనే మందులను వాడాలని అన్నారు. ఒక ఎకరా నికి 5 కిలోల చొప్పున బయో కంజబ్జన్ కంపెనీ నుంచి తెప్పించి వేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు, జీఎం సతీష్ నారాయ న్, నర్సరీ అసిస్టెంట్ మేనేజర్ చాణక్య, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రైతులు కేతిపల్లి ఆదిరెడ్డి,పోతు రవీందర్ రెడ్డి,పున్నం మల్లారెడ్డి, దుంపల మహేందర్ రెడ్డి, మొట్ల కిషన్, మాడబుచ్చిరెడ్డి, వాసుదేవరెడ్డి, కానిగంటి రేణుక పాల్గొన్నారు.