నవతెలంగాణ-నర్సంపేట
కాంగ్రెస్ కు ఓటేస్తే మోస పోయి గోస పాడుతామని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ వ్యవస్థాపకులు, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో అనిల్ కుర్మాచలం మాట్లా డు తూ సీఎం కేసీఆర్ నేతృ త్వంలోని ప్రభుత్వం తెలంగాణ రా ష్ట్రం అద్భుతంగా తీర్చిద్దబడిందన్నారు. 24 గంటల కరెంట్ సరఫరా, సాగు నీటి ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం మైందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల కు, రైతులకు భరోసాగా నిలిచాడన్నారు. ఇప్పుడిప్పుడే తెలం గాణ ప్రజలు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటు న్నా రని, 60 ఏళ్ల కాంగ్రెస్, 15 ఏళ్ల తెలుగు దేశం పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో వెనుకపడిందన్నారు. తెలంగాణ ఆకాంక్షతో పు ట్టిన ఉద్యమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ ఐలు పాలు పంచుకున్నారని తెలిపారు. పుట్టిన గడ్డ బాగుండాలనే కాంక్ష తో బీఆర్ఎస్ను గెలిపించాలని తమ అభిమతమన్నారు. కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే ఇక మరో 20 యేండ్లు వెన క్కిపోక తప్పదన్నారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు, బీజేపీ మతోన్మాదం అంటుందని, అభివృద్ధిలో ముందుంజ లో నిలిచిన తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. వాటిని తెలంగాణ సమాజం చేధించా లన్నారు. ఖండంతరాలు దాటినా మేము తెలంగాణ ప్రాంత బిడ్డలమని, ఈ ప్రాంత అస్థిత్వాన్ని కాపాడే ఏకైక నాయక త్వం కేసీఆర్ తోనే సాధ్యమౌతుందన్నారు.
ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పరిపాలన అందించారని ఫలితంగా దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఉద్యమంలో జీవితాన్నే త్యాగంచేసిన గొప్ప వ్యక్తి,ఎన్నో పోరాటాల్లో పాలుపంచుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అతను ఎన్నికైన ఐదేళ్ళలోనే నర్సంపేట దశ దిశను మార్చారు.ఈ ఐదేండ్లలో విద్య, వై ద్యం, సాగునీటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించడం లో పెద్దిసుదర్శన్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు. విజన్ ఉన్న నాయకుడిని ప్రజలు ఆశీర్వాదించాలని నర్సంపేట అభి వృద్ధి మరింత ముందుకు సాగడానికి పెద్ది సుదర్శన్ రెడ్డికి మరోమారు భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. నర్సంపే టలో పెద్దిని అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ ఐ సెల్ అడ్వైజర్ తన్నీరు మహేష్, ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాద్యక్షులు నవీన్ రెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ యూఎస్ఎ పిన్న భాస్కర్, బిందులత, ఎన్నారై బీఆర్ఎస్ యూకే కడుదుల ర త్నాకర్, గొట్టెముక్కుల సతీష్ రెడ్డి, మదు యాదవ్, శానబో యిన రాజ్కుమార్, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కొరబోయిన విజ రు, సాంబరాజు వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.