నవతెలంగాణ – మద్నూర్
భారతదేశంలోని అత్యుత్తమంగా తీర్చి దిద్దుతూ బంగారు తెలంగాణ బాటలో నడిపించే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పట్టపగలే వీధిలైట్లు వెలగడం పల్లె వెలుగు వెలుగుతుంది. కేసీఆర్ హాయంలో వ్యవసాయ రైతాంగానికి పంట సాగు కోసం 24 గంటలు ఉచిత కరెంటు అందించడం సరి అయింది కానీ గ్రామాల్లో వీధిలైట్లు 24 గంటలు వెలిగితే ఆ కరెంటు బిల్లు ఎవరు భరించాలి. భారం ఎవరిపైన పడుతుంది అనేది ఏ ఒక్కరు ఆలోచించడం లేదని విమర్శలు మద్నూర్ మండలంలో వెళ్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు పంచాయతీ పాలకవర్గం నిద్ర అవస్థ లో పనిచేయడం పట్టపగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు వెలుగుతున్న వీధిలైట్లు పట్ల ఇంత నిర్లక్ష్యమా కరెంటు చార్జీలు కట్టేది గ్రామ ప్రజలు పట్టపగలు లైట్లు వెలిగించడం ఎందుకు వెలుగుతున్న విధిలైట్ల పట్ల నిర్లక్ష్యం ఎవరిది అధికారులదా పంచాయతీ పాలకవర్గం దా 24 గంటలపాటు వీధిలైట్లు వెళితే కరెంటు బిల్లులు పెరగకుండా ఉంటాయా ఇలాంటి నిర్లక్ష్యం పట్ల మండల ప్రజలు అధికారుల తీరుపై పంచాయతీల పాలకవర్గం తీరుపై అగ్రం వ్యక్తం చేస్తున్నారు పట్ట పగలు వీధిలైట్లు వెలుగుతుంటే చూచి చూడనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యము పాలకవర్గం నిర్లక్ష్యమా ఏమిటో కానీ కెసిఆర్ హయంలో 24 గంటలపాటు పల్లెలు వెలగాలనేది నిబంధన వచ్చిందా ఎందుకంటే బంగారు తెలంగాణగా అభివృద్ధి బాటలో కేసీఆర్ నడుపుతున్నాడని అధికార పార్టీ సభల్లో సమావేశంలో చెప్పుకునే తీరుకు 24 గంటలపాటు వెలుగుతున్న వీధిలైట్లే నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. ప్రజలు దేశంలోని అభివృద్ధి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కొనసాగుతున్నది అన్నదానికి 24 గంటలు పాటు వెలుగుతున్న విధిలైట్లు కూడా అభివృద్ధిలో ఒక భాగం అంటున్నారు గ్రామాల ప్రజలు ఇలాంటి వ్యవహారాలపైన నిర్లక్ష్యం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.