– వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు
– ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ, ఈసీ నదులు, వాగులు, కాలువలు
– అలుగులు దుంకుతున్న చెరువులు, చెక్డ్యాంలు
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతున్న ది. ఆదివారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధతంగా ప్రవ హిస్తున్నాయి. చెరువులు కుంటలు, చెక్డ్యాంలకు వరద నీరు వచ్చి చేరుతుండగా.. అలుగులు దుంకుతున్నాయి. అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపా తాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయ వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న మూ సీ, ఈసీ నదులు, వాగులు, కాలువలు అలుగులు దుంకు తున్న చెరువులు, చెక్డ్యాంలు అనంతగిరి అడవుల్లో ఆకటు ్టకుంటున్న జలపాతాలుజిల్లాలో వరుణుడి జోరు కొనసాగు తున్నది. ఆదివారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధ తంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాం లకు వరద నీరు వచ్చి చేరుతుండగా.. అలుగులు దుంకు తున్నాయి. అనంతగిరి కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి అక్కడక్కడ శిథిలావస్థకు చేరిన ఇండ్లు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేప ట్టారు. జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుం డా వర్షం కురిసింది. వాగు, వంకలు ఉప్పొంగగా, కాల్వలు ఉధతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరి మత్తడి దుంకుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునగగా, కాల్వలపై ఉన్న కల్వర్టుల వద్ద నీరు ఉధతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు నేల కూలగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా యం త్రాంగం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
విడవని ముసురు
వికారాబాద్ జిల్లాలో జోరు వాన కురిసింది. ప్రధాన మైన మూసీ, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వా గులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తం భించాయి. పలు చెరువులు నిండి అలుగు పారుతున్నా యి. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు గ్రామాల్లో శిథి లావస్థకు చేరిన పలు ఇండ్లు నేలకూలగా, మరికొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా ప్రజలకు అత్యవసరమైన సాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి, 24 గంట లపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.