– అబద్దాలతో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
నవతెలంగాణ-మల్హర్రావు
రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఏలిన కాంగ్రెస్సోళ్లు ఏమీ చేయకుండా మళ్లీ ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వా లని అడుగడం సరికాదని, అవకాశం ఇస్తే ఏం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం మండలంలోని అన్సాన్పల్లి, నాచారం, మల్లంపల్లి, రుద్రారం, సుభాష్నగర్, ఎడ్ల పల్లి, కొండంపేట, ఇప్పలపల్లి,శాలపల్లి, వల్లెంకుంట గ్రామాల్లో జిల్లా ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనీఫెస్టోతో పాటు తన సొంత మానీఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అధికా రంలో ఉండి ఏమీ చేయనోల్లు మళ్లీ అధికారం కోసం ఆరాటపడుతున్నారని, గతంలో ఆ పార్టీ ఏమీ చేయలేదనే ఆలోచన ప్రజలు చేయరని ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓట్ల కోసం ఆరు అబద్దాల పథకాలను చెప్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రాంత ప్రజలకు తనవంతుగా ఏం చేస్తడో చెప్తలేదని విమర్శించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాలుగేండ్లలో అనేక అభివధ్ది పనులు చేశానని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలను మీ గడపకు చేర్చానని అన్నారు. ఆనాడు మండలంలో జరిగిన అభివద్ది అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయే తప్ప అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే ఏమీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలని అబద్దాలతో ముందుకు వస్తున్నారని, ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టినపథకాలను దుబారా అంటున్నారని అన్నారు, అబద్దాలకు చిరునా మా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈనాడు సీఎం కేసీఆర్ రెండువేలు,మూడు వేల పించన్ ఇస్తుంటే మేమూ ఇస్తామంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయ కులు ఆనాడు పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పించన్ను ఒక్క రూపాయి కూడా పెంచ లేదని, ఆనాడు పెంచని వాళ్లు ఈనాడు వేలకువేలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన అన్నారు. కసీఆర్ ప్రవేశపెట్టే ప్రతి పథకానికి గ్యారెంటీ ఉంటుందన్నారు. ఈనాడు బీఆర్ఎస్ మేనీఫెస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం ఎంతో అద్బుతమైనవని, ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చేవని ఆయన అన్నారు. ఈ ప్రాంత అభివద్ది, ప్రజల సంక్షేమం కోరే తనను ఆదరించి ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. తాను ఇచ్చిన మాటను ఏనాడు తప్పలేదని, మాటకు కట్టుబడి పని చేస్తానని, అబద్దాలు నమ్మి మోసపోకుండా మీ బిడ్డగా ఆశీర్వదించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, పిఏసిఎస్ చైర్మన్ రామారావు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి,మంథని మార్కెట్ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, సర్పంచ్ కాశాని రామయ్య, నాయకులు కర్రు నాగయ్య, యదగిరిరావు, తాజాద్దీన్, ప్రకాష్ రావు,అజ్మీరా సమ్మయ్య, శ్రీషేలం పాల్గొన్నారు.