– ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
– భూపాలపల్లిలో గండ్ర సత్తన్న గెలవబోతున్నారు
– వైయస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్
నవతెలంగాణ-భూపాలపల్లి
ఎన్నికల్లో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్తన్నకు పూర్తి మద్దతునిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు ఉన్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, వైయస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, వైఎస్ఆర్టీపి ముఖ్య నాయకులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ట్రేడ్ యూనియన్ లను నిర్వీర్యం చేశారని కార్మిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వ్యవహరిస్తున్నారని కార్మిక సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదని గుడిసె వాసులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, వైయస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ లతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి కార్మికుల సమస్యలు పరిష్కరిద్దామని అన్నారు. బీఆరెస్కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని, కేసీఆర్ కేబినెట్ అంతా తెలంగాణ ద్రోహలతో నిండిపోయిందనని వారు ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పునాదులు కదిలిపోతుంటే బీఆరెస్ నేతల ఫామ్ హౌజ్లు కమిషన్లతో దోచుకున్న డబ్బులతో నిండిపోతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, టిపిసిసి సభ్యుడు చల్లూరి మధు, మాజీ టీపిసీసీ సభ్యుడు చల్లూరి సమ్మయ్య, జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, పట్టణ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, కురిమిళ్ళ శ్రీనివాస్, ఉడుత సరోజన ,రాజమల్లు, ముఖ్య నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొరిమి సుగుణ పాల్గొన్నారు.