నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. రాష్ట్ర కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదట కరీంనగర్కు చేరుకోనున్న కేసీఆర్.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం గంగాధరకు వెళ్లి అక్కడి సభలో ప్రసంగిస్తారు. ఇక చివరగా జమ్మికుంటకు చేరుకుని అక్కడ డిగ్రీ కళాశాలలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు తీవ్రంగా కురిపిస్తున్నారు.