నవతెలంగాణ కడప: ట్రిపుల్ఐటీలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఈ ఘటన వైయస్ఆర్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ బాయ్స్ హాస్టల్-2లో చోటుచేసుకుంది. హాస్టల్ లో ఓ మంచం కింద కొండ చిలువ కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని కొండచిలువను గోనె సంచిలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.