– ట్రెండ్ను ఫాలో అవుతున్న అభ్యర్థులు
– పార్టీ సింబల్ గుర్తుండేలా ఆయా అభ్యర్థుల ప్రయత్నాలు
– వస్తువులపై పార్టీ గుర్తులు, నాయకుల బొమ్మలతో ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు పూర్తయి.. వాటి పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. మరోవైపు పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలను వేగిరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ఆయా పార్టీల అభ్యర్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పార్టీ సింబల్, అభ్యర్థి ఎవరూ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరహా ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ(ఎం) అభ్యర్థులు ముందు వరుసలో ఉండగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఆశించిన స్థాయిలో లేరని తెలుస్తోంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా..బీఆర్ఎస్, కాం గ్రెస్, సీపీఐ(ఎం), బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ వంటి తదితర పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థు లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీల నుంచి బీఫామ్ దక్కించుకున్న అభ్య ర్థులు ఇప్పటికే నామినేషన్లు వేయగా.. సోమ వారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ షురు కాగా.. ఈనెల 15(నేడు) వరకు ఉపసం హరణకు గడువు ఉంటుంది. అనం తరం 30న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులం తా ప్రచారంలో వేగం పెంచారు. గతానికి భిన్నంగా కండువాలు, వాల్ పోస్టర్లలే కాకుండా.. ట్రెండ్కు అనుగుణంగా.. మొబైల్ ఫోన్ స్టిక్కర్లు, పౌచ్లు, పార్టీ సింబ ల్తో బ్యాడ్జీలు, టీషర్టులు, టోపీలు, కీ ఛైన్స్ ఇలా ఎన్నో వస్తువులపై తమ పార్టీ గుర్తులు, నాయకుల బొమ్మలు ఉన్న వాటితో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, కులసం ఘాలతో భేటీలు, అపార్ట్మెంట్లలో గ్రూపు సమావేశాలు, పాదయాత్రలు, ప్రచార ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభల్లో ఇవి ఎంతో ఆకర్షిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం సందర్భంగా వీటిని ఉపయోగిస్తున్నారు. వృద్దులు, మహిళలు, కార్మికులు, కిందిస్థాయి ఉద్యోగులు సులువుగా గుర్తుంచుకునేలా ఈ తరహా ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తూ.. వారిని తమ వైపు తీప్పు కునేలా ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీ సింబల్ అయి నా.. చేతి(హస్తం) గుర్తునే.. ప్రచార హస్తంగా మార్చుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లిన ఆరు గ్యారంటీలతో పాటు ‘హస్తం’ను చూపిస్తున్నారు. ప్రజలకు సులువుగా అర్థమ వుతుందన్న ఆలోచనలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులంతా వివిధ ప్రచారాల్లో తమ చేతినే పార్టీ (హస్తం) సింబల్గా చూపిస్తూ.. ప్రచారంలో బీఆర్ఎస్కు ధీటుగా సాగుతు న్నారు. ఈ తరహా ప్రచారంలో సీపీఐ(ఎం) కూడా ముందు వరుసలో ఉండగా.. ట్రెండ్కు అనుగుణంగా మిగతా పార్టీలు పెద్దగా ఆలోచించడం లేదనే సమాచారం. మొత్తానికి ఎన్నికల సమయంలో ఇలాంటి వస్తువులకు మంచి గిరాకీ ఉండడంతో పాటు నిర్వహకులకు సైతం ఉపాధి దొరుకుతోంది.