– ముషీరాబాద్లో డ్రయినేజీ సమస్యలు
– సీపీఐ(ఎం) ముషీరాబాద్ అభ్యర్థి దశరథ్
– ముషీరాబాద్ జోన్లో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ – ముషీరాబాద్
ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) ముషీరాబాద్ అభ్యర్థి దశరథ్ ప్రజలను కోరారు. మంగళవారం నియోజక వర్గంలోని ముషీరాబాద్ డివిజన్ జాంబవి నగర్, ఎంసీహెచ్ కాలనీ, గంగపుత్ర కాలనీ, భరత్ నగర్ ,అంబేద్కర్ నగర్ లోని పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి దశరథ్ మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధిం చిందని గుర్తు చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) మరిన్ని పోరాటాలు, సేవా కార్యక్రమాలు జరపడానికి మీరు వేసే ప్రతి ఓటు తోడ్పడుతుందని తెలిపారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో డ్రయినేజీ వ్యవస్థ కుప్పకూలిపోయి, మురుగునీటితో అనేక బస్తీలు, కాలనీలను వరద ముంచెత్తుతు న్నద న్నారు. దాంతో ట్రాఫిక్ నిలిచిపోతున్నదని తెలిపారు. కరెంటు పోతున్నదన్నారు. ఇతర బలహీనమైన మౌలిక వసతులతో హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా ఎలా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారఅని తెలి పారు. కాబట్టి ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు పద్మ. అజరు బాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యు రాలు అరుణ్ జ్యోతి. సీపీఐ(ఎం) నాయకులు అరవపల్లి శ్రీరాములు, ఆంజనేయులు, మహేష్ ,రాఘవేంద్ర, రజియా తదితరులు పాల్గొన్నారు