– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
నవతెలంగాణ-చింతకాని
ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గం అభ్యర్థి పాలడుగు భాస్కర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఓటర్లను కోరారు. గురువారం మండల పరిధిలోని పలు గ్రామాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాలడుగు భాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమని, నిత్యం ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలే తన సమస్యలుగా పోరాడే కామ్రేడ్ పాలడుగు భాస్కర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకి రాములు, నారాయణ, కిరణ్ బాబు, ఉపేందర్, గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.