– మాజీ కార్పొరేటర్ మందడపు మనోహర్
నవతెలంగాణ-ఖమ్మం
తోటి కార్పొరేటర్ తిట్టరాని, తిట్లు తిట్టడం వల్లనే మనోవేదనకు గురై బీఆర్ఎస్ పార్టీ మారానని, మనసుకు నచ్చింది చేశానని మాజీ కార్పొరేటర్ మందడపు మనోహర్, 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ అన్నారు. గురువారం ఖమ్మంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేమని తెలిపారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.. నా చేత సంతకం చేయించుకున్న ఖాళీ నోటును తిరిగి నాకు ఇవ్వాలన్నారు. నాపై అనుమానపు వేధింపులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తోటి కార్పోరేటర్లు ఇకనైనా కళ్ళు తెరిచి అధికార అహంకారంతో అక్రమాలకు పాల్పడుతున్న ఉన్న వారిపై వైపు కాకుండా అభివృద్ధి ప్రధాతైన తుమ్మల అనేది నిర్ణయించుకోండన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, పట్టణ అధ్యక్షులు జావిద్, రమేష్రెడ్డి, కమర్తపు మురళి, ముస్తఫా, ఆశ్రిఫ్, పాషా, శేషగిరి, నగేష్ ,ఆనంద్, జగన్ తదితరులు పాల్గొన్నారు.