– హోం మంత్రి మహమూద్ అలీ
– బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ర్యాలీ
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మంలో పువ్వాడ విజయాన్ని కాంక్షిస్తూ హౌంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ నామ నాగేశ్వరరావు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఖమ్మంలో పువ్వాడను గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని వారు అన్నారు. పువ్వాడ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని37, 38, 39, 40, 41, 27వ డివిజన్ పరిధిలోని ఖిల్లా, కమాన్ బజార్, కాస్బా బజార్, బీకే బజార్, రాతి దర్వాజ, నిజాం పేట, శుక్రవారిపేట, బోనకల్ రోడ్, సెంట్ మేరీ స్కూల్, ముస్తఫా నగర్ వరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ రోడ్ షో చేపట్టారు. పువ్వాడకు మద్దతుగా వారి తనయుడు పువ్వాడ నయన్ రాజ్ రావడంతో బైక్ ర్యాలీ హైలెట్గా నిలిచింది. యువకులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని, బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలు కూడళ్లలో హౌం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని అని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్ళలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అద్భుతంగా పని చేసిందన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్న ఖమ్మంలో పువ్వాడకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకోల్లు నీరజ, ముస్లిం నేతలు, మైనార్టీ ప్రముఖులు, సీనియర్ నేతలు, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
ఇంటింటి ప్రచారంలో పువ్వాడ సతీమణి
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నగరంలోని 12వ డివిజన్లో మంత్రి పువ్వాడ అజరుకుమార్ సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌళిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి అభివృద్ది చేసిన బిఆర్ఎస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజరు కుమార్ కే తమ ఓటు వేసి మళ్ళీ గెలిపించాలని కోరారు. హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.