– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్
అధికారం, పదవులు కోసం చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీ జెండాలు మారుస్తున్న తరుణంలో సిపిఐ(ఎం) సిద్ధాంతం, ఆశయాల సాధన కోసం స్థిరమైన రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఎర్రజెండా సైనికుడు భూక్యా వీరభద్రంకు ఓట్లు వేసి గెలిపించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు కోరారు. బుధవారం రాత్రి వైరా మండలం పాలడుగు, వల్లాపురం, అష్టగుర్తి, గొల్లెనపాడు గ్రామాల్లో వైరా అసెంబ్లీ సిపిఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో అభ్యర్థి భూక్యా వీరభద్రంకు వీర తిలకం దిద్ది, పూలమాలలు వేసి, పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ నేటి సమాజంలో కమ్యూనిస్టుల అవసరం పెరిగిందని, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, దోపిడీ, అణిచివేత, దౌర్జన్యాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐ(ఎం) పార్టీని ప్రజలు ఆదరించాలని, భూక్యా వీరభద్రంను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, ప్రజలకు ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని, స్వచ్చమైన రాజకీయాలు చేస్తూ కేసులు, నిర్బంధాలను భరిస్తూ అంకితభావంతో ప్రజల కోసం పోరాడుతున్న తన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకులు బొంతు సమత, బాజోజు రమణ, తూము సుధాకర్, నల్లమోతు వెంకటనారాయణ, కిలారు శ్రీనివాసరావు, షేక్ షైనాబి, కిలారు లక్ష్మి, బాణాల శ్రీనివాసరావు, పారుపల్లి కృష్ణారావు, కొణిదన కోటేశ్వరరావు, వనమా చిన్న సత్యనారాయణ, షేక్ మజీద్, అమరనేని వెంకటేశ్వరరావు, చిత్తారు నాగరాజు, గుడిమెట్ల మోహనరావు, తాళ్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.