– కొమరారం, బోడు మండలాల ఏర్పాటు బాధ్యత నాదే
– ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం
నవతెలంగాణ-ఇల్లందు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, అన్నివర్గాల ప్రజల కోరిక మేరకు కొమరారం, బోడు మండలాల ఏర్పాటు చేస్తామని ఆ భాధ్యత నాదేనని ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కోరం కనకయ్య హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందు మండలంలోని మర్రిగూడెం, పోలారం, పోచారం, కొమరారం, గ్రామ పంచాయతీల్లో గురువారం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరం కనకయ్యకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రసంగిస్తూ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు వివరిస్తూ, రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కే దక్కుతుందని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 తదితర వైద్య సేవలు అందించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని, అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో నియోజకవర్గానికి 1500లకు పైగా డబుల్ బెడ్ రూమ్లు తీసుకువచ్చానని, ఈ ఐదేళ్లలో ఇల్లందు నియోజకవర్గానికి ఎన్ని డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేశారో తెలపాలన్నారు. ఇటీవల కాలంలో ఓటమి భయంతో కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి చిల్లర మాటలు, వెకిలి చేష్టలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ పార్లమెంట్ ఇన్చార్జి బాణోత్ సుజాత, మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, ఎంపీటీసీలు బాణోత్ రోజా, మండల రాము, పూనెం సురేందర్, పాయం కృష్ణప్రసాద్, ఉప సర్పంచ్ తాటి రాంబాబు, వార్డు సభ్యుడు బాణోత్ రాంబాబు, నాయకులు కిన్నెర నర్సయ్య, చెన్నూరి శ్రీను, చెన్నూరి కృష్ణ, ఉపేందర్, రాంబాబు, సువర్ణపాక సత్యనారాయణ, తాటి బిక్షం, ముక్తి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.